:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / crime /

వాడొక టీచర్ ముసుగులో ఉన్న కీచకుడు - అనేక మంది బాలికలపై అత్యాచారం

By Admin | Posted on: 12-08-2021 10:08 | : 486



ఇతనొక టీచర్...రేపిస్ట్....నయవంచకుడు...గురువనే మాటకే తలవంపులు తెచ్చిన ఓ దుర్మార్గుడు. తన దగ్గర చదువుకునే అనేక మంది అమ్మాయిలను లోబర్చుకొని రేప్ చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రాజాపూర్ మహేష్ అనే కీచకుడు ఓ ప్రైవేటు స్కూళ్ళో టీచర్ గా పనిచేస్తున్నాడు. కరోనా కాలంలో ఆన్ లైన్ క్లాసెస్ పేరుతో అందరి ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. చిన్నపిల్లలకు ఫోన్లు చేయడం చదువుపేరుతో చనువుపెంచుకోవడం చేశాడు. అనేక మందిని మెల్లగా ట్రాప్ చేసి లోబర్చుకొని రేప్ చేశాడు. వీడొక్కడే కాదు... ఆరుగురు వీడి స్నేహితులు కూడా ఆ అమ్మాయిలపై అత్యాచారం చేశారు. ఈ దుర్మార్గుడి ప్రాణ స్నేహితుడైన పంచాయితీ కార్యదర్శి కూడా ఈ గ్యాంగ్ లో సభ్యుడే. అంతే కాదు అతను తన భార్యను పుట్టింటికి పంపి మరీ అతని ఇంట్లోనే అనేక మంది అమ్మాయిలపై అత్యాచారం చేశారు. కొంత కాలంగా ఈ దుర్మార్గం సాగుతున్నప్పటికీ బాధితులెవ్వరూ నోరు మెదపలేదు. అయితే ఓ బాలిక తండ్రి ఈ మధ్య పోలీసులకు పిర్యాదు చేయడంతో డొంక కదిలింది.

ఈ మధ్య ఈ రేపిస్ట్ గ్యాంగ్ ఓ బాలికను ట్రాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఆ బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు పిర్యాదు చేశాడు. తీగ లాగిన పోలీసులకు కదిలిన డొంక కనిపించింది. టీచర్ ముసుగులో ఆ దుర్మార్గుడు అతని స్నేహితులు చేసిన అత్యాచారాలన్ని వెలుగులోకి వచ్చాయి. అయితే విషయం తెలిసి నిందితులందరూ పరారయ్యారు. ఒక్క పంచాయితీ కార్యదర్శి మాత్రం పోలీసుల చేతికి చిక్కాడు. మిగతావారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పంచాయితీ కార్యదర్శికి రాజకీయ పరిచాయాలు ఎక్కువగా ఉండటం, పలుకుబడికలిగినవాడు కావడంతో అతన్ని రక్షించడానికి పలువురు ముఖ్య రాజకీయ నాయకులు రంగంలోకి దిగినట్టు సమాచారం.