:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / telangana / Nalgonda

ఎం జె ఎఫ్ జిల్లా అధ్యక్షునిగా జీడిమెట్ల రవీందర్ మాదిగ ఎన్నిక

By Vinod Kumar | Posted on: 30-08-2023 21:08 | : 311



నల్లగొండ, ఆగస్టు 30 (వుదయం ప్రతినిధి):

మాదిగ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులుగా జీడిమెట్ల రవీందర్ మాదిగ రెండవసారి ఎన్నికయ్యారు మిర్యాలగూడలోని ఎస్ వి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నల్లగొండ జిల్లా మహాసభలలో ఆయన ఎన్నికైనట్లుగా రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ మాదిగ ప్రకటించారు. ఈ సందర్భంగా రవీందర్ మాదిగ మాట్లాడుతూ మాదిగ జర్నలిస్టుల హక్కులకై, సంక్షేమానికై కృషి చేస్తానని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా బాధిత పీడిత అణగారిన ప్రజల హక్కులకై జర్నలిస్టులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా మాదిగ జర్నలిస్టులకు, రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.