:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / business /

గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంలతో ఇక పనిలేదు.. అందుబాటులోకి కొత్త యూపీఐ సేవలు!

By Admin | Posted on: 17-05-2023 15:05 | : 401



మీరు గూగుల్ పే వాడుతున్నారా? లేదంటే ఫోన్‌పే ఉపయోగిస్తున్నారా? ఇవి రెండూ కాకపోతే మీ ఫోన్‌లో పేటీఎం ఉందా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

మార్కెట్‌లోకి కొత్త యూపీఐ (UPI) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మీరు ఈజీగానే పేమెంట్లు చేయొచ్చు. ఇంతకీ ఏ కంపెనీ ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిందో తెలుసుకోవాలని చూస్తున్నారా? ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) తాజాగా సొంతంగానే యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

సాధారణంగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయాలని భావిస్తే.. పేమెంట్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు ముంగింపు పలికేందుకు జొమాటోనే సొంతంగా యూపీఐ సేవలు తీసుకువచ్చింది. పేమెంట్ చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ యాప్స్‌ప ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం జొమాటో ఈ కొత్త సర్వీసులు తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. దీని వల్ల కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.

శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా!

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు పేమెంట్ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్‌ ఓపెన్ చేయాల్సిన పని లేదు. నేరుగా జొమాటో యూపీఐ ద్వారానే మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించొచ్చు. దీని ద్వారా పని ఈజీగా పూర్తి అవుతుంది. అంటే బిల్లు పేమెంట్ చేసేటప్పుడు పేటీఎం , ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటితో అవసరం లేదని చెప్పుకోవచ్చు. నేరుగా జొమాటో యూపీఐ ద్వారానే పేమెంట్ చేయొచ్చు.