By admin | Posted on: 10-05-2022 11:05 | : 426
బాలీవుడ్ పరిశ్రమపై సూపర్ స్టార్ మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం జరిగిన మేజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహేశ్కు బాలీవుడ్ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడ సినిమాలు చేసి టైం వెస్ట్ చేయనంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. సౌత్ సూపర్ స్టార్ అయిన మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది. ఆయన హిందీలో ఓ సినిమా చేయాలని అటూ నార్త్తో పాటూ సౌత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో హిందీ చిత్ర సీమలో ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హిందీ పరిశ్రమ నుంచి ఆఫర్లు బాగానే వచ్చాయని.. కానీ తనను వారు భరించగలరని అనుకోవడం లేదన్నారు. నన్ను భరించలేని పరిశ్రమలో టైం వేస్ట్ చేసుకోవడమే అవుతుందని.. టాలీవుడ్ లో నాకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి.. అంతేగాక నాకు మంచి గౌరవం, గుర్తింపు, స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. దీనిపట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ పరిశ్రమను విడిచి మరేదో ఇండస్ట్రీకి పనిచేయాలనే ఆలోచన తనకు లేదని చెప్పారు. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని ఎప్పుడూ అనుకుంటాను.. తన కల ఇప్పుడు నెరవేరుతోందని మహేశ్ బాబు వివరణ ఇచ్చాడు.
మహేశ్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట ఈనెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి, ఎవ్రీ పెన్ని సాంగ్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.