:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / world /

జైల్లో అగ్ని ప్రమాదం - 41 మంది మృతి !

By Admin | Posted on: 08-09-2021 05:09 | : 305



ఇండోనేషియాలోని ఓ జైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో  41 మంది ఖైదీలు మరణించారు. 39 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇండోనేషియా రాజధాని జకార్తా శివార్లలోని టాంగెరాంగ్ జైలులో ఈ ప్రమాదం జరిగింది. మాదకద్రవ్యాల నేరస్థుల కోసం ఈ జైలు ఏర్పాటు చేశారు. జైలులోని సీ బ్లాక్ లో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. 

ఈ జైలు 1,225 మంది ఖైదీలను ఉంచడానికి రూపొందించబడింది. కానీ ఈ జైల్లో 2,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన బ్లాక్ సీ లో 122 మంది ఖైదీలు ఉన్నారు. 

మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. బాధితులందరినీ ఆస్పత్రికి తరలించిన అధికారులు జైలు వద్ద పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించారు. 

ఈ అగ్నిప్రమాదం పై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. త్వరలోనే నిజాలు బైటికి వస్తాయని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రికా అప్రియంతి అన్నారు.  

ఇండోనేషియాలో జైల్‌బ్రేక్‌లు మరియు అల్లర్లు సర్వసాధారణం. ఇక్కడ అక్రమ మాదకద్రవ్యాలపై ప్రభుత్వం చేపట్టిన యుద్ధంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అరెస్టవుతున్నారు. జైళ్లలో రద్దీ పెద్ద సమస్యగా మారింది.