:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / movies /

క్రాక్ సినిమా కథ తనదేనంటూ పీఎస్ లో ఫిర్యాదు

By admin | Posted on: 12-05-2022 13:05 | : 207



రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా కథ తనదేనని, తన కథనాన్ని టైటిల్ ను కాపీకొట్టారంటూ శివ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినీ నిర్మాత మధుసూధన్ రెడ్డి, దర్శకుడు మలినేని గోపిచంద్, హీరో రవితేజలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

తాను ముందుగా నోటీసులు పంపినప్పటికి నిర్మాత, దర్శకుడు, హీరో ఆ నోటీసులను తీసుకోకుండా తిప్పి పంపారని, అందుకే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను ఫిర్యాదులో పేర్కొన్న వారిపై కాపీరైట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.