By admin | Posted on: 21-05-2022 12:05 | : 337
బుల్లితెరపై రియాల్టీ షో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం విజేత ఎవరనే దానిపై ఓ పేరు జోరుగా ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విజేతగా హీరోయిన్ బిందు మాధవి నిలిచిందనే వార్త గుప్పుమంటోంది. ఒకవేళ బిందు మాధవి నిజంగానే విన్నర్ అయితే ఆమె చరిత్ర సృష్టించినట్టే. ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ లో ఓ మహిళ విజేతగా నిలవలేదు.
ఇప్పటి వరకు వరుసగా శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్, సన్నీ.. బిగ్ బాస్ తెలుగు విజేతలుగా నిలిచారు. గీతా మాధురి, శ్రీముఖి మాత్రమే రెండు, మూడు సీజన్లలో రన్నరప్ గా నిలిచారు. ఇక ఓటీటీ వెర్షన్ లో శివ మూడో స్థానంలో , అరియానా నాలుగో స్థానంలో , మిత్రా ఐదో స్థానంలో, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్ ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.
కాగా బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారికి కూడా అవకాశం ఇచ్చారు. అఖిల్ సార్థక్ కూడా ఆ విధంగానే మరోసారి హౌస్ లోకి వచ్చాడు. సీజన్ -4 లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ ఈ సారి కూడా రన్నరప్ గా నిలిచినట్టు సమాచారం.
ఈ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంది. ఎందుకో ఏమో కానీ దీనికి ప్రేక్షకాదరణ దక్కలేదు. మరి ఓటీటీ నిర్వాహకులు సెకండ్ సీజన్ ప్లాన్ చేస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.