By K. SATHISH KUMAR | Posted on: 12-06-2023 17:06 | : 336
చెన్నూరు జూన్ 12 వు దయం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొనిమంచిర్యాల జిల్లా జైపూర్ సబ్- డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ 2K రన్ చెన్నూర్ పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుండి ప్రభుత్వ హై స్కూల్ గ్రౌండ్ వరకు నిర్వహించారు జరిగింది ఇందులో చెన్నూర్ సి ఐ వాసుదేవరావు కోటపల్లి సి. ఐ విద్యాసాగర్ శ్రీరాంపూర్ సి. ఐ రాజు చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి సుపరెండెంట్ డాక్టర్ సత్యనారాయణ ఎస్ ఐ లు ఉపేందర్ చంద్రశేఖర్ , రాజేష్ సుబ్బారావు వెంకటస్వామి సౌజన్య, శ్వేత గంగరాజు గౌడ్ లు రిటైర్డ్ పి.డి రాములు ,పి.డి లు మల్లేష్ ఫణి కుమార్ లు పాల్గొన్నారు అంతేకాకుండా. చెన్నూర్ జైపూర్ భీమారం కోటపల్లి మండలంలోని యువకులు ప్రజా ప్రతినిధులు అధికారులు క్రీడాకారులు క్రీడాభిమానులు వివిధ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు